ప్రభాస్ మరియు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో రానున్న భారీ చిత్రం ‘స్పిరిట్’ గురించి ఒక ఆసక్తికరమైన వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతుండగా, ఈ నెలాఖరు నుండే షూటింగ్ ప్రారంభం కానుందని దర్శకుడు సందీప్ వంగా స్వయంగా తెలిపారు. సమాచారం ప్రకారం, మొదటి షెడ్యూల్ మెక్సికోలో ప్రారంభమవుతుంది, ఈ షెడ్యూల్లో ప్రభాస్ లేని సన్నివేశాలను చిత్రీకరిస్తారు. ప్రభాస్ రెండవ షెడ్యూల్లో టీమ్తో కలవనున్నారు.
అయితే, ఈ సినిమాకు సంబంధించిన అసలు ఆశ్చర్యకరమైన విషయం దర్శకుడి బృందం గురించి. ఈ సినిమా కోసం సందీప్ రెడ్డి వంగా ఏకంగా 20 మంది అసిస్టెంట్ డైరెక్టర్లను (ఏడీలను) తీసుకున్నట్లు తెలుస్తోంది. భారతీయ సినిమాల్లో సాధారణంగా నలుగురైదుగురు సహాయ దర్శకులు మాత్రమే ఉంటారు. 20 మందితో కూడిన బృందం ఉండటం చాలా అరుదు.
ఈ 20 మంది ఏడీల బృందంలో ఇద్దరు ప్రముఖుల కుమారులు ఉండటం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. వారిలో ఒకరు మాస్ మహారాజా రవితేజ తనయుడు మహాధన్. ‘రాజా ది గ్రేట్’ చిత్రంలో రవితేజ చిన్నప్పటి పాత్రలో నటించి మహాధన్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. నటనలో ప్రశంసలు అందుకున్న అతను, ఇప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేరడం రవితేజ అభిమానులను ఆశ్చర్యపరిచింది.
ఈ బృందంలో ఉన్న మరో స్టార్ కిడ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కుమారుడు రిషి. రిషికి ఇప్పటికే ఫిల్మ్ మేకింగ్పై ఆసక్తి ఉంది, అతను యూట్యూబ్ కోసం కొన్ని షార్ట్ ఫిల్మ్లను కూడా తీశాడు. ఇప్పుడు సందీప్ వంగా దగ్గర పనిచేయడం ద్వారా అతను దర్శకత్వంలో మెళకువలు నేర్చుకోనున్నాడు.
ఇక ఇతర వివరాల్లోకి వెళితే, ఈ చిత్రంలో ‘యానిమల్’ ఫేమ్ త్రిప్తి దిమ్రి హీరోయిన్గా నటిస్తోంది. అంతేకాకుండా, ప్రభాస్ ఈ సినిమా కోసం ఏకధాటిగా 80 రోజులు నాన్-స్టాప్ డేట్స్ కేటాయించినట్లు సమాచారం. సాధారణంగా ఒకేసారి రెండు మూడు సినిమాలు చేసే ప్రభాస్, సందీప్ వంగా కోరిక మేరకు ఇతర ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి ‘స్పిరిట్’ సెట్స్లోకి అడుగుపెట్టనున్నారు.

