మహేష్-రాజమౌళి ఫస్ట్ రివీల్ కోసం భారీ ఈవెంట్. జియో హాట్‌స్టార్‌లో లైవ్.!

టైటిల్‌తో పాటు ఫస్ట్ గ్లింప్స్ విడుదలయ్యే ఛాన్స్; ఏకంగా ఓటీటీలో లైవ్ స్ట్రీమింగ్ అవుతున్న ఫస్ట్ రివీల్ ఈవెంట్ ఇదే!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రపంచ స్థాయి దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి కలయికలో రూపొందుతున్న సినిమా ‘SSMB29’ గురించి ఎదురుచూస్తున్న అభిమానులకు అసలైన ‘బిగ్ అప్‌డేట్’ వచ్చేసింది. ఈ భారీ యాక్షన్ అడ్వెంచర్ సినిమా టైటిల్ రివీల్ కోసం నిర్మాతలు చరిత్రలో నిలిచిపోయేలా ఒక భారీ ఈవెంట్‌ను ప్లాన్ చేశారు.

‘SSMB29’ ఫస్ట్ రివీల్ నవంబర్ నెలలో ఉంటుందని ఇప్పటికే ప్రకటించారు. దానికి తగ్గట్టుగానే, సినిమా యూనిట్ ఒక పక్కా తేదీని ఖరారు చేసింది.

నవంబర్ 15, సాయంత్రం,హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీ లో ఈ భారీ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు.ఈ వేదికపై సినిమా టైటిల్‌ను అధికారికంగా ప్రకటిస్తారు. దీంతో పాటు, అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ను కూడా విడుదల చేసే అవకాశం ఉంది.

OTT లో లైవ్ స్ట్రీమింగ్: ఇదే తొలిసారి

సాధారణంగా సినిమాలకు ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లను భారీగా నిర్వహించడం పరిపాటి. కానీ, కేవలం ఫస్ట్ రివీల్ కోసం ఇంత పెద్ద ఈవెంట్‌ను ప్లాన్ చేయడం భారతీయ సినిమా చరిత్రలోనే ఇదే మొదటిసారి అని చెప్పవచ్చు.

ఈ చారిత్రక ఈవెంట్‌ను ప్రముఖ ఓటీటీ వేదిక జియో హాట్‌స్టార్ లో లైవ్ స్ట్రీమింగ్ చేయనున్నారు. రాజమౌళి మరియు మహేష్ బాబు కాంబినేషన్ రేంజ్ ఏంటో ఈ భారీ ఏర్పాట్లు స్పష్టం చేస్తున్నాయి.

టైటిల్ ‘వారణాసి’ ఫిక్స్ అవుతుందా?

ఈ యాక్షన్ అడ్వెంచర్ చిత్రానికి ‘SSMB29’ అనేది వర్కింగ్ టైటిల్‌గా ఉంది. నిర్మాత కె.ఎల్. నారాయణ అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ సినిమాకి సంబంధించిన పలు ఊహాగాన టైటిల్స్ ప్రచారంలో ఉన్నప్పటికీ, ఇటీవల ‘వారణాసి’ అనే టైటిల్ ప్రముఖంగా వినిపిస్తోంది. నవంబర్ 15న ఈ టైటిల్‌పై ఉన్న సస్పెన్స్ వీడనుంది.ఈ భారీ ప్రాజెక్ట్ అప్‌డేట్ కోసం ఎదురుచూస్తున్న మహేష్ అభిమానులు, సినీ ప్రేమికులు ఈ ప్రకటనతో రెట్టింపు ఉత్సాహంలో ఉన్నారు.

Leave a comment